ఎండ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

కొల్చారం మండలం (మెదక్ టుడే న్యూస్)వేసవి కాలం ఎండ దెబ్బ భారీ నుంచి చిన్నపిల్లలను… మహిళలు తగు జాగ్రత్త తీసుకోవాలని కొల్చారం ఏఎన్ఎం లు మజితా బేగం, కవిత మహిళలకు సూచించారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారం లోని సబ్ సెంటర్లో పిల్లల తల్లులకు బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎండ దెబ్బ నుంచి రక్షణ కోసం ఓ ఆర్ ఎస్ ద్రావణాన్ని తాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు రాణి కవిత, పిల్లల తల్లులు పాల్గొన్నారు.