మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్.
పాపన్నపేట,ఫిబ్రవరి,12, మెదక్ టుడే న్యూస్:మహా శివరాత్రి సందర్బంగా మెదక్ జిల్లా ఏడుపాయలలో ఫిబ్రవరి 15 నుండి 17 వరకు జరిగే వనజాతర ఏర్పాట్లను మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ గురువారం పరిశీలించారు. ఆలయం ముందు నది పాయలో శివుడిని ఏర్పాటు చేసే ప్రాంతం,లడ్డు పులిహోర ప్రసాద విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు. సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఆలయ ఈఓ వీరేశం మీడియాతో మాట్లాడుతూ, ఈ మహాశివరాత్రి జాతరకు తెలంగాణ ప్రాంతమే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్ ఉన్నారు.

