పాపన్నపేట, జనవరి 28 న్యూస్:మెదక్ జిల్లా లోని ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయ ఈవోగా ఎం. వీరేశం ను నియమిస్తూ దేవాదాయ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఆయన ఏడుపాయల కార్యాలయంలో ఈవో గా బాధ్యతలను స్వీకరించారు. ఇది వరకు ఆయన రంగారెడ్డి జిల్లా, కుషాయిగూడ లోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయ బాధ్యతలను నిర్వహించారు.

