డ్రంక్ అండ్ డ్రైవ్ పదివేల జరిమానా-తాగి వాహనాలు నడిపిస్తే కఠిన చర్యలు,మహమ్మద్ మొయి ఉద్దీన్.

కొల్చారం,మే,25,మెదక్ టుడే న్యూస్:ఇటీవల పోలీసుల సాధారణ తనిఖీలలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వ్యక్తికి మెదక్ స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి ఊరే ప్రభాకర్ పదివేల జరిమానా విధించినట్లు కొల్చారం ఎస్సై మహమ్మద్ మోయి ఉద్దీన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ తాగి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.