MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 22 December 2025, 12:58 pm Digital Edition : SHIVA KUMAR

దళితుల జర్నలిస్టుపై దాడి-కలెక్టర్ కు వినతి పత్రం..

(స్టేట్ బ్యూరో)ప్రకాశం జిల్లా,డిసెంబర్,22,మెదక్ టుడే న్యూస్: అర్ధవీడు మండలం కాకర్ల గ్రామంలో న్యాయం చేయమని వెళ్తే మాదిగ జర్నలిస్టుపై దాడి.కాకర్ల గ్రామం మాజీ సర్పంచ్ కోటపాటి వెంకటేశ్వర్ రెడ్డి ఫోన్ చేసి పిలిపించి మద్యం మత్తులో ఉండి ఆయనతో ఉన్న వాళ్లకు మద్యం తాపీ నన్ను రప్పించి నాపై దౌర్జన్యం చేసి కడుపులో తన్ని, చెంపపై కొట్టడం జరిగింది.మాదిగ జర్నలిస్టుగా నాకే రక్షణ లేనప్పుడు దళిత సమాజానికి ఎక్కడ రక్షణ ఉంటుంది.దళితులు అంటే పల్లెలలో ఇంత చులకనగా చూస్తారా.ప్రశ్నిస్తే నీ అంత చూస్తామంటారా.ఎక్కడ దళితులకు న్యాయం జరుగుతుంది దళితులు వాళ్ళ హక్కుల ప్రకారం వాళ్లు స్వేచ్ఛగా బతకనివ్వరా.న్యాయం చేయమని వెళ్తే కొట్టేస్తారా కొట్టే హక్కు ఎవరు ఇచ్చారు. దళితులు వాళ్ళ ఆత్మగౌరవంతో బతకడం వాళ్లకు ఇష్టం లేదా వాళ్ళ దగ్గరికి వెళ్లి వంగి వంగి దండాలు పెడితే వాళ్లకు దళితులు నచ్చుతారా.ఆధునిక సమాజంలో ఇంకా దళితులపై దౌర్జన్యం సమ సమాజ స్థాపన జరగాలని ప్రజా ప్రతినిధులు వక్తలు చెబుతారు కానీ ఇప్పటికీ గ్రామాలలో గ్రామాలలో అనగారిన పీడిత వర్గాలపై ఉక్కు పాదం మోపుతూ రాజకీయ ఆర్థిక అండదండలు కలిగినటువంటి వారి చేతులలో దళితులు ఇంకా బలహీనులుగా ఉండాలా.