MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 25 May 2026, 1:14 am Digital Edition : Shiva Kumar

చేగుంట గ్రామంలో సోదర దినోత్సవం ఘనంగా నిర్వహించబడినది.

చేగుంట,మే,24,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని అంబేద్కర్ యువజన సంగ్ ఆధ్వర్యంలో అన్నదమ్ముల దినోత్సవం ఘనంగా నిర్వహించబడినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా వాలీబాల్ అధ్యక్షుడు అఐత పరంజ్యోతి హాజరై కేక్ కట్ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ మన జీవితంలో అన్న ప్రాముఖ్యత ఎక్కువ అమ్మానాన్న తర్వాత ఆలనా పాలన ధైర్యం నమ్మకం సోదరుడే, తల్లిలా ప్రేమ ఆప్యాయతలు చూపించేది అక్కాచెల్లెళ్లు తల్లి తండ్రుల బాధ్యతలు వారి భుజాలపై వేసుకొని మోసేది అన్న తమ్ముళ్లు అని వారు అన్నారు. అందరూ సంతోషంగా ఉండాలి అందరితో కలిసి మెలిసి ఉండాలి అని వారు కోరారు.ఈ కార్యక్రమంలో అఐత పరంజ్యోతి,సోమ సత్యనారాయణ, ఎర్ర యాదగిరి, అంబేద్కర్ యువజన సంగ్ అధ్యక్షుడు విష్ణు,అక్బర్,బాలేష్,సాదుల్లా, నరేష్,ఎల్లేష్, సల్లుపాష,బాబు,దాసరి సురేష్,కొండి స్వామి,తదితరులు పాల్గొన్నారు.