చేగుంట,జూన్,4,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీ 14వ వార్డు గల్లీ పరిస్థితి దయనీయంగా మారింది. వర్షాకాలం ప్రారంభంలోనే ఇక్కడి వీధులు మురుగుకూపాన్ని తలపిస్తున్నాయి. కొద్దిపాటి వర్షానికే డ్రైనేజీలు పూర్తిగా నిండిపోయి, మోరీల్లోని మురికినీరు, బురద మొత్తం రోడ్డుపైకి చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై నిలిచిన మురుగునీరు, పేరుకుపోయిన చెత్తాచెదారం వల్ల స్థానికులు, వాహనదారులు కనీసం నడవలేని పరిస్థితి నెలకొంది. నిత్యం ఈ బురద నీటిలోనే ప్రయాణించాల్సి వస్తోందని, మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు వ్యాపించి రోగాల బారిన పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.