MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 31 January 2026, 5:32 am Digital Edition : SHIVA KUMAR

చేగుంటలో గాంధీ చౌరస్తా వద్ద మహాత్మా గాంధీ వర్ధంతి

చేగుంటలో గాంధీ చౌరస్తా వద్ద మహాత్మా గాంధీ వర్ధంతి

మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ.

చేగుంట, జనవరి, 30, మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ చౌరస్తాలో పూలమాల వేసి నివాళులర్పించిన ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీక్, చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ వల్లనే మనకు స్వాతంత్రం వచ్చిందని అహింసా మార్గం ద్వారా తెచ్చాడని స్వతంత్రం కోసం ఎన్నో త్యాగాలు కూడా చేశారని వారు అన్నారు.ఉపాధి హామీ పథకం పై గాంధీ పేరు మార్పిడిపై ప్రధానమంత్రి ఒకసారి పునరాలోచించాలని గాంధీ అంటే గుండె చప్పుడు అని కరెన్సీ పై కూడా మనం మహాత్మా గాంధీ ఫోటోనే కనపడుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సండ్రు గు సతీష్, చేగుంట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్,ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ, వార్డు మెంబర్లు ఆకుల సుఖేందర్, బక్క సాయి బాబా,హమాలీ సంఘం అధ్యక్షులు సోమ వెంకటేష్, కర్రె పోశెట్టి, తలారి లింగం, మహమ్మద్ రహీముద్దీన్,కట్ట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.