MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 1:42 am Digital Edition : Medak Today

చేగుంట రైతు వెదిక లో వ్యవసాయ వారోత్సవాలు.

చేగుంట,మే,6,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజా పాలనలో – ప్రగతి ప్రణాళికలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా చేగుంట వ్యవసాయ రైతు వేదికలో మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగళరావు అధ్యక్షతన అధ్వర్యంలో ఘనంగా రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలు, బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక, స్వల్ప కాలిక పంట రుణాలు పైన రైతులకు అవగాహన కల్పించారు. రైతు శ్రేయస్సుకోసం రైతు సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ అని కొనియాడారు. కార్యక్రమంలో తాసిల్దార్ శివప్రసాద్, ఎంపీడీఓ చిన్నారెడ్డి,అగ్రికల్చర్ ,డిసిసిబీ బ్యాంక్ మేనేజర్ శశికాంత్ రెడ్డి, వ్యవసాయ సైంటిస్ట్ డాక్టర్ రామాంజనేయులు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు, మొహమ్మద్ ముజామిల్, అన్నం ఆంజనేయులు, స్టాలిన్ నర్సిములు, బాల్ రెడ్డి, కాషాబోయిన శ్రీనివాస్, రఫీ, కుర్మ లక్ష్మి, లక్ష్మణ్ , రమేష్ , వివిధ గ్రామాల సర్పంచ్ లు ,క్లస్టర్ వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.