చేగుంట,మార్చి,13,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలో గ్రామపంచాయతీ వెనకాల గల ఆరవ వార్డు ప్రజలు మాకు చాలా సంవత్సరాల నుండి డ్రైనేజీ సరిగా లేదు అని సర్పంచ్ సండ్రు గు స్రవంతి సతీష్ దృష్టికి తీసుకురాగానే సర్పంచ్ అక్కడికి వెళ్లి చూసి చాలా ఇబ్బందికరంగానే ఉంది అని నూతన డ్రైనేజీ వేయిస్తున్నారు దానిని ఈరోజు పరిశీలించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్రవంతి సతీష్, వార్డు మెంబర్లు ఆకుల సుఖేందర్,తలారి లింగం, శ్రీకాంత్ వార్డు సభ్యులు పాల్గొన్నారు.