చేగుంట,మార్చి,12,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలో మహిళ సమాఖ్య కార్యాలయం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, మండల మహిళా సమాఖ్య- చేగుంట ఆధ్వర్యంలో వివిధ బ్యాంకు మేనేజర్ ఎం ఎస్ వారి సౌజన్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది .గ్రామ సంఘం అధ్యక్షురాలు గ్రామ సంఘం విఓఏ లు అందరు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు రకరకాల ఆటల పోటీలు పాటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా గౌరవ అడిషనల్ డిఆర్డిఓ సరస్వతి రావడం జరిగింది మేడం చేతుల మీదుగా పోటీలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానోత్సవం చేయడం జరిగినది. ఈకార్యక్రమంలో డిపిఎం బ్యాంక్ లింకేజి బాలరాజ్, మండల సమైక్య పాలకవర్గం, ఎఫ్ పి సి పాలకవర్గం, ఏపిఎం, సీసీ లు, ఎంఎస్ఏ, ఎంఎస్ఓ, ఎఫ్ పి సి సీఈఓ, అకౌంటెంట్ మరియు అటెండర్ పాల్గొనడం జరిగింది.
