MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 31 January 2026, 5:37 am Digital Edition : SHIVA KUMAR

చేగుంట లోని 14 వ వార్డు రోడ్లకు మహర్దశ

చేగుంట జనవరి 30 మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని 14 వ వార్డులో గత 15 సంవత్సరాలుగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నాయి ,రోడ్లు చూడటానికి కనీసం నడవడానికి కూడా సరిగా లేక ప్రజలు చాలా రోజులగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎన్నోసార్లు అధికారులకు చెప్పుకున్న పట్టించుకోలేదు. ఇప్పుడు నూతన పాలకవర్గంలో సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, వార్డు సభ్యుడు ఆకుల సుఖేందర్ కలిసి రోడ్లును మొరంతో బాగు చేసి ప్రజలకే గాక వెహికల్స్ పోవడానికి రోడ్లన్నీ బాగు చేయడం జరిగింది.అని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప్ప సర్పంచ్ మహ్మద్ రఫీ,వార్డు సభ్యులు ఉదయ్ రాజు,సాయిబాబా, గ్రామస్తులు కట్ట శ్రీనివాస్, శశి కుమార్, తలారి లింగం, నాగేష్ సేటు, సురేందర్ ,సతీష్ శివ కుమార్ సార్, గణేష్ సార్ ,యాదగిరి ,రామకృష్ణ సార్,కిషన్ సార్, లక్ష్మణ్ సార్, రమేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.