చేగుంట,మే,5,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ మెంబర్ మెదక్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అధ్యక్షులు శ్రీ తొడుపునూరి రాజు-కవిత దంపతుల 30వ వివాహ వార్షికోత్సవ వేడుకలను మంగళవారం మక్కారాజ్ పెట్ రోడ్ లో గల శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్ లో చేగుంట, చిన్న శంకరంపేట, నార్సింగి ఉమ్మడి మండలాల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దంపతులు పూలమాలలు మార్చుకోగా అసోసియేషన్ సోదరులంతా కలిసి రాజు దంపతులకు శాలువాతో ఘనంగా సత్కరించి, కేక్ కట్ చేయించారు. అనంతరం దంపతులకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలుపుతూ, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆత్మీయంగా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో చేగుంట ఏరియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు లక్ష్మీనారాయణ, అయిత రఘురాములు, స్వామి, భాస్కర్, వెంకన్న, కృష్ణమూర్తి, రమణ, ప్రకాష్, నాగేశ్వర్ రావు, సురేష్, భూపాల్, శ్రీనివాస్, శేఖర్,మొయిన్ పాషా, ప్రశాంత్, రమేష్ తదితరులు పాల్గొని సందడి చేశారు.
