చేగుంట,డిసెంబర్,1,మెదక్ టుడే న్యూస్:
చేగుంట గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపించాలని వారు కోరుతూ సోమవారం నాడు సర్పంచ్ రిజర్వేషన్లలో భాగంగా బిసి మహిళా రిజర్వ్ స్థానం కావడంతో సర్పంచ్ అభ్యర్థిగా చేగుంట పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సండ్రుగు సతీష్ సతీమణి సండ్రుగు
స్రవంతి సోమవారం నాడు
నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నన్ను చేగుంట సర్పంచ్ గా గెలిపిస్తే దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఆశీస్సులతో చేగుంట అభివృద్ధికోసం కృషి చేస్తాను చేగుంట పట్టణాన్ని అభివృద్ధి చేయాలి అంటే కష్టపడే వ్యక్తి కావాలి కాబట్టి నన్ను గెలిపిస్తే ప్రజల సంక్షేమం కోసం పాటుపడతాను ప్రతి వ్యక్తీ సమస్యను నాసమస్యగా తీసుకొని పరిష్కరిస్తారని సమాజ సేవకురాలుగా ప్రజలతో మమేకమై నీతి నిజాయితీతో పనిచేసి చేగుంట పట్టణాన్ని అభివృద్ధి చేసిచూపిస్త అని అన్నారు. చేగుంట ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తానని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో చేగుంట మండల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ చేగుంట మాజీ పిఎసీఎస్ చైర్మన్ సండ్రగు స్వామి, యువ నాయకుడు సండ్రుగు శ్రీకాంత్, అవసుల బ్రహ్మం,సిద్ది రెడ్డి,సోమ పెద్ద వెంకటేష్,సండ్రగు రవి, రాజు రమేష్ చేగుంట ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

