చౌక దుకాణాల పనితీరు ఆదర్శం కలెక్టర్-రేషన్ షాపుల బియ్యం తూకాల పరిశీలన.
నిత్యావసర వస్తువుల పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనం
అత్యంత పారదర్శకంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు మూడు నెలల రేషన్
పంపిణీ.

మెదక్, ఏప్రిల్, 5, మెదక్ టుడే న్యూస్, ప్రతినిధి.
జిల్లాలో 520 రేషన్ దుకాణాలు
పిడీఎస్ ప్రయోజనాలు పారదర్శకంగా, సమర్థవంతంగా ఉద్దేశించిన లబ్ధిదారులకు చేరేలా చూడటం కోసం పటిష్ట చర్యలు.ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మకుండా, గందరగోళానికి లోనుకాకుండా, ప్రశాంతంగా తమకు లభ్యమయ్యే (03) నెలల రేషన్ సరుకులను పొందాలి.ఏప్రిల్, మే, జూన్ (3) నెలల రేషన్ సరఫరా – ఈ నెల 30 వరకు పంపిణి.మెదక్ జిల్లాలో చౌక దుకాణాల పనితీరు ఆదర్శంగా ఉందని నిత్యావసర వస్తువుల పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనంక్షేత్రస్థాయిలో కనపడుతుందని,పిడీఎస్ ప్రయోజనాలు పారదర్శకంగా, సమర్థవంతంగా ఉద్దేశించిన లబ్ధిదారులకు చేరేలా చూడటం కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు ఎలాంటి వదంతులు అసత్య ప్రచారాలు నమ్మకుండాప్రశాంతంగా తమకు లభ్యమయ్యే మూడు నెలల రేషన్ ఈ నెల 30 వరకు పొందాలని
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు.జిల్లా కేంద్రంలోని పత్తి నగర్ ప్రాంతంలో షాప్ నెంబర్ -04 చౌక ధరల దుకాణాన్నికలెక్టర్ తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, పౌరసరఫరాల ఇన్స్పెక్టర్ నరసింహులు, సిబ్బంది నాగరాజు, తో కలిసి ఆదివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్టాక్ ను తూకాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు లబ్ధిదారులతో సంభాషించారు. చౌక ధరల దుకాణాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని లబ్ధిదారులు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి నిత్యావసర వస్తువుల పంపిణీ జరగాలని ఆదేశించారు. లబ్ధిదారులు లేవనెత్తిన ఏవైనా సమస్యలు లేదా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత రెవెన్యూ సిబ్బంది సివిల్ సప్లై సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
