MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 8:17 am Digital Edition : Shiva Kumar

క్యాన్సర్ తో పోరాటం-స్నేహ హస్తం అందేనా.

పాపన్నపేట,జూన్,16,మెదక్ టుడే న్యూస్:చిన్న పిల్లలకు జ్వరం వస్తేనే తల్లితండ్రులు బయపడుతారు లేదా జ్వరం తగ్గేందుకు వైద్యుడికి చూపిస్తారు.అదే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే అ కుటుంబ బాధ వర్ణణాతీతం.మెదక్ జిల్లాలో అరేండ్ల బాలుడు బ్లడ్ క్యాన్సర్ వ్యాధి బారిన పడడంతో అ కుటుంబానికి దిక్కు తోచని పరిస్థితి నెలకొంది. పాపన్నపేటకు చెందిన మంగళి సాయిబాబ – శోభ దంపతుల కుమారుడు యువన్షు 2024 నుండి మహమ్మారి కాన్సర్ తో బాధపడుతున్నాడు. క్యాన్సర్ వ్యాధి వైద్యానికి అ కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక,వైద్యానికి తోచినంత తగు సాయం చేసే దాతలు చరవాణి నెంబర్ 8096106545 కు ఫోన్ పే లేదా సంప్రదించాలని తల్లితండ్రులు వేడుకుంటున్నారు .