బ్లూ స్టార్ ఈవెంట్స్ పురస్కారం: ‘రాష్ట్రీయ దివ్య ప్రతిభా సమ్మాన్’ కు మీర్ గియాసుద్దీన్ ఎంపిక.
చేగుంట,మే,26,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, మెదక్ జిల్లాకు చెందిన ప్రముఖ సామాజిక సేవా నిర్వాహకులు వడియారం గ్రామం మీర్ గియాసుద్దీన్ ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు. బ్లూ స్టార్ ఈవెంట్స్ సంస్థ దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన ప్రముఖులకు అందజేసే "రాష్ట్రీయ దివ్య ప్రతిభా సమ్మాన్ - 2026" అవార్డుకు తెలంగాణ రాష్ట్రం నుండి ఆయనను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు. మీర్ గియాసుద్దీన్ సమాజంలో వెనుకబడిన, ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగుల శ్రేయస్సు కోసం...