మెదక్,ఫిబ్రవరి,8,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి,మెదక్ ప్రజలను నమ్మించి మెదక్ వచ్చిన విధులను సిద్దిపేటకు తీసుకెళ్లి పదేళ్ల కాలంలో మోసం చేసిన బిఆర్ఎస్ దొంగల ముఠా హరీష్ రావుకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. ఆదివారం మెదక్ పట్టణంలోని 6,11,27,13 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో మెదక్ లో గెలుపొందిన ఎమ్మెల్యేలు హరీష్ రావు చుట్టు భజనలు చేస్తూ కాలం వృధా చేశారు తప్ప మెదక్ ను అభివృద్ధి చేయాలనే ఆలోచన రాకపోవడం ఈ ప్రాంత ప్రజలను మోసగిస్తూ మెదక్ ను అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురిచేసారని ఎమ్మెల్యే రోహిత్ ఆరోపించారు. మెదక్ ను అభివృద్ధి చేయడం కోసం కొట్లాడి నిధులు తేవాల్సిన గత ఎమ్మెల్యే అధిష్టానం దగ్గర వారి వ్యక్తిగత అభివృద్ధి కోసం ప్రయత్నం చేశారు తప్ప ఏనాడు మెదక్ పట్టణ ప్రాంత ప్రజల అవసరాల కోసం నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేయించాలనే ధ్యాస లేకపోవడంతో నేడు మెదక్ రంగాల్లో వెనుకబడి వినాయక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మెదక్ నియోజకవర్గం కొట్లాది నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మెదక్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

