అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి.
అమీన్పూర్,నవంబర్,15,
(మెదక్ టుడే న్యూస్)ప్రతినిధి
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఓడిఎఫ్ కాలనీలో ప్రకాష్ రెడ్డి కన్నె స్వామి,విజయ రాఘవరెడ్డి కన్నె స్వామి, వి. రామ్ రెడ్డి గురు స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న అమీన్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి. మాజీ చైర్మన్ పాండురంగ రెడ్డి మాట్లాడుతూ ఆర్య పుత్రుడు అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కార్తీక మాసంలో ఎంతో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి మాలవేసి ఆ శబరిమలకు వెళ్తున్న స్వాములందరికీ ధన్యవాదాలు అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కొల్లూరు మల్లేష్, సీనియర్ నాయకులు కొల్లూరు యాదగిరి, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
