కొల్చారం,మే,26,మెదక్ టుడే న్యూస్:కొల్చారం మండలం అప్పాచిపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా ఎల్లమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి ఏటా ఎల్లమ్మకు బోనాలు తీయడం ఆనవాయికి.చివరి రోజు ఎల్లమ్మకు ఏడంతరాల బోనం తోపాటు గౌడ సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులు పురవీధుల గుండా ఆలయం వద్దకు బోనాలు ఎత్తుకెళ్లి వారి వారి మొక్కలు సమర్పించుకున్నారు. బోనాల ముందు శివశక్తుల పూనకాలు పలువురిని ఆకట్టుకున్నాయి.
