MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 4:45 am Digital Edition : SHIVA KUMAR

అమీన్‌పూర్‌లో సీలింగ్ భూముల పరిశీలన: ఆక్రమణలు ఉంటే కూల్చివేతలు తప్పవు – ఎమ్మార్వో వెంకటేష్.

అమీన్‌పూర్,మే,6,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి)సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండల పరిధిలోని ప్రభుత్వ సీలింగ్ భూములను రెవెన్యూ అధికారులు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండలంలోని సర్వే నంబర్లు 1042, 1043 లో ఉన్న సీలింగ్ భూములను అమీన్‌పూర్ తహసీల్దార్ వెంకటేష్, ఆర్.ఐ సంగీత, సర్వేయర్ మరియు ఇతర రెవెన్యూ సిబ్బందితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో వెంకటేష్ మాట్లాడుతూ గతంలోనే నోటీసులు: సదరు సర్వే నంబర్లలోని భూములపై గతంలోనే ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసినట్లు ఎమ్మార్వో తెలిపారు.సర్వే నిర్వహణ: ఈ భూములకు సంబంధించి త్వరలోనే పూర్తిస్థాయి సర్వే ప్రక్రియను ముగించి, హద్దులను నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు.
కఠిన చర్యలు: సర్వే పూర్తయిన వెంటనే పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగించి, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటామని ఎమ్మార్వో హెచ్చరించారు.ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, ఎవరూ కూడా ఇటువంటి ప్రయత్నాలు చేయవద్దని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది మరియు సర్వే అధికారులు పాల్గొన్నారు.