MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 4:16 pm Digital Edition : Medak Today

అమీన్‌పూర్ అక్రమ తైబజార్ వసూళ్లపై డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ సీరియస్ హెచ్చరిక: జైలు శిక్ష తప్పదు!

వ్యాపారులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు: డిప్యూటీ కమిషనర్

అమీన్‌పూర్,మే,1,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి,సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలో తైబజార్ పేరుతో సాగుతున్న అక్రమ వసూళ్లపై అమీన్‌పూర్ జిహెచ్‌ఎంసి డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ తీవ్రంగా స్పందించారు. గడువు ముగిసినప్పటికీ ప్రజలను, చిరు వ్యాపారులను ఇబ్బంది పెడుతూ అక్రమంగా డబ్బులు వసూలు చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు.

డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ ఆదేశాలు:

తైబజార్ వసూళ్లపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో డిప్యూటీ కమిషనర్ స్పందిస్తూ క్షేత్రస్థాయి అధికారులకు మరియు వసూలు చేస్తున్న వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు:

  • మార్చి 31తో గడువు ముగిసింది: అధికారికంగా తైబజార్ నిర్వహణ గడువు మార్చి 31 నాటికే ముగిసిందని, ప్రస్తుతం ఎవరికీ వసూలు చేసే హక్కు లేదని స్పష్టం చేశారు.
  • వసూలు చేస్తే జైలుకే: “ఉన్నతాధికారుల నుండి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తైబజార్ వసూలు చేయకూడదు. ఎవరైనా నిబంధనలను అతిక్రమించి సామాన్యులను ఇబ్బంది పెడితే, వారిపై కఠిన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తాం” అని ప్రదీప్ కుమార్ హెచ్చరించారు.
  • ఆధారాలతో ఫిర్యాదు చేయండి: ఎవరైనా అక్రమంగా డబ్బులు అడిగితే, వ్యాపారులు భయపడకుండా ఆధారాలతో తమకు ఫిర్యాదు చేయాలని, అక్రమార్కులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.

అక్రమార్కులకు చెక్!

ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం నుండి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎవరూ తైబజార్ పేరుతో డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని డిప్యూటీ కమిషనర్ స్పష్టం చేశారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.