చేగుంట,మే,1,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని అమాలి సంఘం ఆవరణలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.కార్మిక దినోత్సవం పురస్కరించుకొని జెండా ఎగరవేశారు ఈ సందర్భంగా కార్మిక సంఘం అధ్యక్షుడు దుర్గి నర్సింలు,సోమ వెంకటేష్, సిరిగోజి సత్యనారాయణ,మాట్లాడుతూ 1986లో చికాగో లో 18 గంటల పనిని ఎనిమిది గంటలకు కుదిస్తూ మే ఒకటో తేదీన అమలు చేయడం జరిగిందని దానిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మే 1వ తేదీని కార్మిక దినోత్సవం గా పిలుస్తూ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అని తెలిపారు.కార్మిక దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో
అధ్యక్షులు దుర్గి నర్సింలు,ఉపాధ్యక్షులు దుర్గి శివరాజ్,ప్రధాన కార్యదర్శి సోమ పెద్ద వెంకటేష్, క్యాషియర్ మెట్టు రవి,కర్ణ లక్ష్మణ్ , ఆర్గానిక్ సెక్రెటరీ సోమషోక్ సలహాదారులు బక్క చిన్న నర్సింలు, తలారి నల్ల పోచయ్య, సిరిగోజి సత్యనారాయణ,మెట్టు భూపాల్, నాగులు, షాదుల్లా,పులబోయిన భూపాల్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.