తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్.
చేగుంట,మే,27,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలోరాత్రి కురిసిన అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాలలో పూర్తిగా తడిసిపోయిన వడ్లు
రైతులు పంటలు పండించి సొసైటీ ఐకేపీ కొనుగోలు కేంద్రాలలోకి వరి ధాన్యాన్ని తీసుకువచ్చి నెలలు దాటిన పూర్తవుతున్న రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వలన రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని రైతులు వర్షం కురవడం వలన వడ్లు పూర్తిగా తడిసిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కొనుగోలు కేంద్రాలకు సరిపడా లారీలను సరైన సమయంలో పంపించకపోవడం మరియు రైస్ మిల్లర్లు జాప్యం చేయడం వలన రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని మండపడ్డారు. రైతులు కష్టపడి పంట పండించిన ధాన్యాన్ని అమ్ముకుంటే పెట్టుబడి కూడా మిగలడం లేదని ఆవేదనలో ఉన్నారని తెలిపారు, అధికారులువెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.