MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 15 November 2025, 12:20 pm Digital Edition : Medak Today

హోమ్ గార్డుల సంక్షేమార్థం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని అదనపు ఎస్ పి సమీక్ష..

హోమ్ గార్డుల సంక్షేమార్థం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని అదనపు ఎస్పీ సమీక్ష

మెదక్,నవంబర్,15,మెదక్ టుడే న్యూస్:

శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు హోం గార్డ్స్ కు ప్రమాద భీమా, ఆరోగ్య భీమా పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి జిల్లా ఎస్ పి శ్రీ. డి. వి. శ్రీనివాస రావు ఐపీఎస్  ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎ స్ పి శ్రీ. ఎస్ మహేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యాక్సిస్ బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ, అకౌంట్ హోల్డర్ ప్రమాదంలో మరణిస్తే వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు రూ.40 లక్షలు పొందవచ్చని తెలిపారు.ఈ సందర్భంగా అదనపు ఎస్ పి మాట్లాడుతూ,హోమ్ గార్డులు జిల్లా పోలీస్ వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తూ ప్రజల రక్షణలో ఎల్లప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు. ఈ సిబ్బందికి అవసరమైన సహాయం, మార్గదర్శకత మరియు సంక్షేమ కార్యక్రమాలను అందించడం పోలీస్ శాఖ యొక్క ప్రధాన బాధ్యత అని తెలిపారు. ఆర్థిక నిర్వహణ, పొదుపు అలవాట్లు, భవిష్యత్ ప్రణాళికపై సరైన అవగాహన పెంపొందితే కుటుంబాలు మరింత స్థిరతను, భద్రతను పొందగలవని వివరించారు.అకస్మాత్తుగా మరణం సంభవించిన సందర్భంలో కుటుంబాలకు కనీస ఆర్థిక భరోసా అందించడానికి టర్మ్ ఇన్సూరెన్స్ లేదా లైఫ్ కవర్ తప్పనిసరి అని ఆయన సూచించారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే భవిష్యత్తులో పెద్ద ఆర్థిక భారం కావచ్చని, అందువల్ల సరైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కుటుంబాన్ని ఆర్థిక నష్టాల నుండి రక్షిస్తుందని తెలిపారు. పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సేవింగ్స్ ప్లాన్‌లు, విద్యా పాలసీలు వంటి పథకాలలో పెట్టుబడి పెట్టడం ఎంతో మంచిదన్నారు.యాక్సిస్ బ్యాంక్ అందిస్తున్న తక్కువ ప్రీమియంతో కూడిన ప్రత్యేక ఇన్సూరెన్స్ ప్యాకేజీలు, కుటుంబ కవర్, క్యాష్‌లెస్ చికిత్స వంటి ప్రయోజనాలను ప్రతి హోమ్ గార్డ్ సిబ్బంది తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం మరియు ప్రైవేట్ బ్యాంకులు అందిస్తున్న రుణ పథకాలు, పొదుపు పథకాలు, బీమా సేవలు, పెన్షన్ ప్రయోజనాలు వంటి సౌకర్యాలు కూడా సిబ్బంది కుటుంబ భద్రతకు చాలా ఉపయోగకరమని పేర్కొన్నారు.హోమ్ గార్డుల సంక్షేమాన్ని మెరుగుపర్చేందుకు రాబోయే రోజుల్లో మరిన్ని అవగాహన కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు, ఆర్థిక సలహా శిబిరాలను నిర్వహించే దిశగా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని అదనపు ఎస్ పి  తెలిపారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలంటే సిబ్బంది సంక్షేమం కూడా సమాన ప్రాధాన్యత కలిగి ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీ రంగా నాయక్, ఆర్‌ఐ శ్రీ శైలేందర్, ఆర్‌ఎస్‌ఐ శ్రీ నరేష్,యాక్సిస్ బ్యాంక్ అధికారులు, హోమ్ గార్డ్ రైటర్ శ్రీ శ్రావణ్ మరియు జిల్లా హోమ్ గార్డులు పాల్గొన్నారు.