అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలో హెల్ప్ డెస్క్ సహకారం తీసుకోవాలి.
•స్కూటీని నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించాలి
•ఎన్నికల సాధారణ పరిశీలకులు
భారతి లక్పతి నాయక్
పాపన్నపేట,నవంబర్,30, మెదక్ టుడే న్యూస్:
ఆదివారం పాపన్నపేట మండలం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు నిర్వహిస్తున్న స్కూటీని సాధారణ పరిశీలకులు భారతి లక్పతి నాయక్ మెదక్ ఆర్ డి ఓ రమాదేవితో కలిసి పరిశీలించి సమర్థ నిర్వహణకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు భారతీ లక్పతి నాయక్ మాట్లాడుతూ, మొదటి విడత సర్పంచ్ వార్డ్ మెంబర్ స్థానాలకు పాపన్నపేట మండలంలో 40 గ్రామపంచాయతీలుగాను సర్పంచ్-221, వార్డ్ మెంబర్స్-727 నామినేషన్లను స్వీకరించడం జరిగిందని. స్కూటీని ని చేయగా 02 నామినేషన్లు రిజెక్ట్ చేయడం జరిగిందని వార్డ్ మెంబర్స్ ప్రపోజర్స్ వారికి సంబంధించిన వార్డులో లేరు వివరాలు తప్పుగా సమర్పించారు అందువలన వారు వేసిన నామినేషన్స్ రిజెక్ట్ అయినట్టు వివరించారు.
ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో రమాదేవి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
