📄 ePaper
Thursday, March 12, 2026
ADS
HomePOITICAL NEWSఅభివృద్ధి అడ్డుకునేలా బిఆర్ఎస్ నాయకుల తీరు - తెల్లాపూర్ కాంగ్రెస్...

అభివృద్ధి అడ్డుకునేలా బిఆర్ఎస్ నాయకుల తీరు – తెల్లాపూర్ కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం.

📰 Generate e-Paper Clip

బిఆర్ఎస్ “డ్రామా” దీక్షలను ఎండగట్టిన కాంగ్రెస్ నేతలు

రామచంద్రపురం,జనవరి,5(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి(ఎం.ఐ.జి విద్యుత్) ట్యాంక్ సెంటర్‌లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, బిఆర్ఎస్ నాయకుల తీరును ఎండగట్టారు.రాజకీయ లబ్ధి కోసమే దీక్షలు:బిఆర్ఎస్ నాయకులు ఎం.ఐ.జి విద్యుత్ నగర్‌ను భారతీ నగర్ డివిజన్‌లో కలిపేందుకు వ్యతిరేకంగా, దానిని తెల్లాపూర్‌లోనే కొనసాగించాలనే డిమాండ్‌తో చేస్తున్న దీక్షలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని కాంగ్రెస్ పార్టీ విమర్శించారు. తొలుత ఈ పోరాటం పార్టీలకు అతీతంగా జరుగుతుందని తాము భావించామని, కాలనీ ప్రయోజనాల దృష్ట్యా తాము దీనిపై ఎలాంటి విమర్శలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.నిరాధారమైన ఆరోపణలు – స్థానిక నేతల అసహనం:గత మూడు రోజులుగా దీక్షల పేరుతో బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై మరియు స్థానిక నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధికి సహకరించాల్సింది పోయి, కేవలం కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు.అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం:
కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని, కాలనీ వాసుల సమస్యల పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే, సమస్యను రాజకీయీకరించి లబ్ధి పొందాలని చూస్తే సహించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు.ఈ సమావేశంలో ఇతర ముఖ్య నాయకులు కూడా పాల్గొని, బిఆర్ఎస్ నాయకుల వైఖరిని ఖండించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి, తెల్లాపూర్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ లెలిజాల రవీందర్ , డీసీసీ వైస్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ గౌడ్, మరియు విద్యుత్ నగర్ ప్రెసిడెంట్ అజీమ్, విద్యుత్ నగర్ ఎం. ఐ.జి. ఫేజ్-2 మాజీ అధ్యక్షులు, డైరెక్టర్లు, కాలనీ నివాసితులు మరియు భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.ఉప్పరపల్లి సుధాకర్ రెడ్డి,మాధవ్ రెడ్డి,తూర్పు శ్రీను,మహమ్మద్ వాజీద్ అహ్మద్,బాబు గౌడ్,దిలీప్ రాయ్,ఎల్లయ్య,మురళి బోరెడ,మహమ్మద్ అక్రమ్,ఆశీర్వాదం,జీవన్,ప్రవీణ్ కుమార్,శ్రీమతి రోహిణి గౌడ్,సలీం షేక్,అరవింద్, ఆనంద్, ప్రవీణ్,నరేందర్ రెడ్డి,అరుణ్ రెడ్డి ,యువజన నాయకులు జావేద్,మహేష్ బిట్టా, పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments