MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 4:44 pm Digital Edition : UPPARI RAJU

మీనాక్షి నటరాజన్ కి జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం – శాపురం నరసింహారెడ్డి

పటాన్ చెరు జూన్ 11

(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి

రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించిన తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ముత్తంగి డివిజన్ (జిహెచ్ఎంసి-265) నాయకుడు శాపురం నరసింహారెడ్డి పేర్కొన్నారు.

మీనాక్షి నటరాజన్ అన్ని అవసరమైన పత్రాలను సమర్పించి, ఎటువంటి పెండింగ్ కేసులు లేకపోయినప్పటికీ, స్వల్ప అభ్యంతరాన్ని ఆధారంగా చేసుకుని ఆమె నామినేషన్‌ను తిరస్కరించడం ఆందోళన కలిగించే విషయమన్నారు. అదే సమయంలో మరో అభ్యర్థికి నిబంధనలలోని లోపాలను సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించడం ఎన్నికల ప్రక్రియలో సమానత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోందన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా మరియు పారదర్శకంగా జరగడం అత్యంత అవసరమని అన్నారు. ప్రతి అభ్యర్థికి ఒకే విధమైన న్యాయం జరగాలని, ఎన్నికల సంఘం ప్రజల విశ్వాసాన్ని కాపాడే విధంగా వ్యవహరించాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని, ప్రజల హక్కులను కాపాడేందుకు నిరంతరం పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.