తెల్లాపూర్ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొన్న పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం,మే,9,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి,సమాజ నిర్మాణంలో విశ్వబ్రాహ్మణుల సేవలు అత్యంత ప్రశంసనీయమని..వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం తెల్లాపూర్ డివిజన్ పరిధిలో గల శ్రీ శ్రీ శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సోమిరెడ్డి, మల్లారెడ్డి, దేవేందర్ యాదవ్, లచ్చి రామ్ నాయక్, బాబ్జి, శ్రీశైలం, మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
