MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 3:44 am Digital Edition : muluguvijaykumar638@gmail.com

5 సంవత్సరాల బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 25 సంవత్సరాల జైలు శిక్ష..

సిద్దిపేట్, జులై 20, మెదక్ టుడే న్యూస్

సిద్దిపేట్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బాలికపై లైంగిక దాడి కేసులోని నిందితుడు గొర్ల రవి కుమార్(57) అనే వ్యక్తికి న్యాయస్థానం 25 సంవత్సరాల జైలు శిక్ష తో పాటు 10,000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం న్యాయమూర్తి వై. జయప్రసాద్ర్ తీర్పు వెల్లడించారు.వివరాల్లోకి వెళితే సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో 22/04/2021న కేసు నమోదు చేయడమైనది. ఈ కేసులో దర్యాప్తు అధికారి అప్పటి అదనపు డిసిపి రామేశ్వర్, ( ఇన్చార్జి ఎసిపి సిద్దిపేట) , ఇన్స్పెక్టర్ బి . శ్రీనివాస్ సమగ్ర దర్యాప్తు నిర్వహించి, పూర్తి సాక్ష్యాధారాలను సేకరించి పటిష్టమైన ఛార్జిషీట్‌ను న్యాయస్థానంలో దాఖలు చేయడమైనది. విచారణ సందర్భంగా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాదుల,ఆత్మరాములు, వాదనలు వినిపించగా, ప్రస్తుత ఇన్స్పెక్టర్ పి. మహేందర్ రెడ్డి , సాక్షాలు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, లైజనింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి , సీడీఓ బాపురెడ్డి, భరోసా ఇన్చార్జ్ అధికారి ఇన్స్పెక్టర్ బి.దుర్గా, భరోసా లీగల్ అధికారి సౌమ్య, భరోసా సిబ్బంది సమన్వయంతో కేసు విచారణలో సహకారం అందించారని పేర్కొన్నారు.సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలు మరియు ఇతర ఆధారాలను పరిశీలించిన  న్యాయస్థానం న్యాయమూర్తి వై. జయ ప్రసాద్  నిందితుడిని దోషిగా నిర్ధారించి 25 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10,000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.నిందితుడికి శిక్ష పడడంలో కృషి చేసిన అధికారులను, సిబ్బందిని సిద్దిపేట సిపి రష్మీ పెరుమాళ్, ఐపీఎస్  అభినందించారు. సమాజంలో మహిళల భద్రతకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని, నేరస్థులకు శిక్ష పడేలా చేయడంలో రాజీ పడబోమని ఈ సందర్భంగా సిపి స్పష్టం చేశారు