📄 ePaper
Tuesday, March 10, 2026
ADS
HomePOITICAL NEWS11వ వార్డు బిజెపి అభ్యర్థి వారే వనిత..ముమ్మర ప్రచారం

11వ వార్డు బిజెపి అభ్యర్థి వారే వనిత..ముమ్మర ప్రచారం

📰 Generate e-Paper Clip

మెదక్ టౌన్,జనవరి,31,మెదక్ టుడే న్యూస్,ప్రతినిధి:కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ అభివృద్ధి కార్యక్రమాన్ని అమృత్ సిటీ లో భాగంగా భారతీయ జనతా పార్టీ కేంద్రం నుండి అత్యధిక నిధులు ఇచ్చి అమృత్ సిటీలను తయారు చేయడానికి నరేంద్ర మోడీ నాయకత్వంలో కంకణం కట్టుకొని భారత ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తున్న భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని.. మెదక్ మున్సిపల్ పట్టణ 11వ వార్డు బిజెపి అభ్యర్థిని వారే నవిత తెలిపారు.. 11వ వార్డులో అనేక భవంతులు ఉన్నాయని వాటిపైన అత్యధికంగా టాక్సులు వసూలు చేయడం సరికాదని ఆమె తెలిపారు .అదే విధంగా అధిక టాక్సీలు చెల్లిస్తున్న వార్డులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో నాటి కౌన్సిల్ విఫలం అయిందన్నారు.బిజెపి తరఫున మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో అన్ని వార్డులను
అమృత్ సిటీ జాబితాలో కలుపుతూ త్రాగునీరు మురికి కాలువల క్రమబద్ధీకరణ మౌలిక వసతులు పారిశుద్ధ్యము పై ప్రణాళికలు.ప్లాస్టిక్ కవర్ నిషేధం. పార్క్. పచ్చదనం
వార్డులో అనుసరిస్తామని.మెదక్ పట్టణాన్ని నందనవనంగా చేయడం బిజెపి లక్ష్యం అని వనిత తెలిపారు. మెదక్ పట్టణంలోస్మశాన వాటికల పరిస్థితిని ప్రజలు గమనించాలని సూచించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్ధినీ గెలిపించండి అని అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వడ్ల జనార్దన్ కృష్ణారెడ్డి వారె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments