•టిఆర్ టిఎఫ్ అధ్యక్షులుగా,
జగన్ లాల్ ఏకగ్రీవం
•టిఆర్ టిఎఫ్ చేగుంట మండల కమిటీ ఏకగ్రీవం
చేగుంట నవంబర్ 15 మెదక్ టుడే న్యూస్:
టిఆర్ టిఎఫ్ చేగుంట మండల అధ్యక్షులుగా కే జగన్ లాల్, ఎస్ఏ(హిందీ) జెడ్పిహెచ్ఎస్ కరీంనగర్ మండల ప్రధాన కార్యదర్శిగా దేవరాజ్,
ఎస్ జి టి యుపిఎస్ పులిమామిడి, ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల టిఆర్ టిఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు మెంగర్తి ప్రణీద్ కుమార్ అభినందనలు తెలియజేశారు. ప్రణీద్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉద్యమ స్పూర్తితో ముందుకు నడుస్తుంది. ఉపాధ్యాయ మిత్రులంతా, టిఆర్ టిఎఫ్ ను అందరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నూతన మండల కమిటీ సంఘ్ కార్యక్రమాలను ఉపాధ్యాయులకు చేరవేస్తూ, వారికి చేరువ కావాలని సూచించారు.నూతన కమిటీ మాట్లాడుతూ మాపై నమ్మకముంచి భాద్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ,ఉపాధ్యాయుల శ్రేయస్సుకై తమ వంతు భాద్యత నెరవేరుస్తామని హామీ ఇచ్చారు
జిల్లా కౌన్సిలర్ లుగా వి వెంకన్న, పిఎస్ హెచ్ఎం బోనాల అబ్దుల్ రషీద్, ఎస్ఏ(బయో), శ్రీనివాస్, ఎస్జిటి లు ఎన్నికయ్యారు.