చేగుంట,మార్చి,12,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల్ ఇబ్రహీంపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పదో తరగతి ఈ జీవితంలో చాలా ముఖ్యమైన మలుపు ఈ దశలో మీరు కష్టపడి చదివితే మీ భవిష్యత్తు బలంగా ఉంటుంది ఎప్పుడు క్రమశిక్షణ పట్టుదల మరియు మంచి ఆలోచనలను మీతో తీసుకొని ముందుకు సాగండి మేము మీకు ఇచ్చిన విద్య సలహాలు,విలువలను జీవితంలో గుర్తుంచుకోండి విజయాలు వచ్చినప్పుడు వినయం ఉండాలి కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి మీరు ఎక్కడికి వెళ్లినా పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలి ఇబ్రహీంపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు ఇట్టి ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.వి లతంబర్ రావ్ గ్రామ ఉపసర్పంచ్ చౌదరి శ్రీనివాస్ ఉపాధ్యాయులు పరంధామయ్య వెంకటేష్ మహేందర్ రెడ్డి బాల్ నరసయ్య గీత నరేష్,వార్డు సభ్యులు,గుండమైన నవీన్, చాకలి శ్యామల. కుమ్మరి రాజు సుమలత,విద్యార్థి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
