MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 10 November 2025, 3:44 pm Digital Edition : Medak Today

మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి, ఉపాధికి ప్రభుత్వం కృషి చేస్తుంది, మెదక్ ఎమ్మెల్యే రోహిత్..

మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి, ఉపాధికి ప్రభుత్వం కృషి చేస్తుంది

కొంటూరు చెరువును సుందరికరించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

మత్స్యకారులకు ఉపాధి కోసం చేప పిల్లల పంపిణీ

ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు

పేదలకు సన్న బియ్యంతో కడుపు నింపుతున్నాం
మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు

మెదక్ మెదక్ మండలం నవంబర్ 10 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి (యాదగిరి)

రాజ్ పల్లి,మల్కాపూర్ తండా,కోమ్ టూర్ లలో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించిన
మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావుఈ సందర్భంగా కోoటూర్ ఏర్పాటు చేసిన సమావేశములో మాట్లాడుతూ ..రూ 35వేల కోట్లు రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నామన్నారు.
ఇందిరమ్మ ఇళ్ళు, గృహ లక్ష్మి,మహాలక్ష్మి పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు.
ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యంమని తెలిపారు.
మత్స్యకారుల సంక్షేమంలో భాగంగా వారికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు.
మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి 100% రాయితీ తో చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మెదక్ మండలం ‌కోంటూర్ పెద్దచెరువులో 1,84,500 చేప పిల్లలు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
సంబంధిత మత్స్య శాఖ అధికారులు
మత్స్య సహకార సంఘ సభ్యులతో కలిసి విడుదల చెయ్యడం జరిగింది . అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. నిర్మాణం లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడారు.మెదక్ శాసన సభ నియోజకవర్గ పరిదిలోని (546) చెరువు లు కుంటలలో (రూ.200.88) విలువ గల (211.39) లక్షల చేప పిల్లలు సరఫరా చేయబడునని తెలిపారు. ఇందులో భాగంగా (39) పెరినియల్ చెరువులలో (63.28) లక్షల 80-100ఎం ఎం సైజు గల చేపపిల్లలు మరియు (507) సిసనల్ చెరువులలో (148.10) లక్షల 35-40mm సైజు గల చేపపిల్లలు విడుదల చేయబడునన్నారు. అదేవిదముగా జిల్లాలోని (1728) చెరువు లు కుంటలు మరియు పోచారం, హల్దీవాగు ప్రాజెక్టులలో రూ.(488.75) లక్షల విలువగల (550.88) లక్షల చేపపిల్లలు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. (82) పెరినియల్ చెరువులలో (132.43) లక్షల 80-100mm సైజు గల చేపపిల్లలు మరియు (1646) సిసనల్ చెరువులలో (418.45) లక్షల 35-40ఎం ఎం సైజు గల చేపపిల్లలు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
జిల్లాలోని (309) మత్స్య పారిశ్రామిక సహకార సంఘములలో గల (16,820) సభ్యులకు జీవనోపాది కలుగుట వలన వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు.
మెదక్ శాసన సభ నియోజకవర్గ పరిధిలోని (98) మత్స్య పారిశ్రామిక సహకార సంఘములలో గల (6762) సభ్యులకు జీవనోపాధి కలుగుట వలన ఎంతో సంతోషిస్తున్నామన్నారు. జిల్లా ప్రజలకు తాజా చేపల మాంసము పుష్కలముగా లభిస్తుందని పేర్కొన్నారు.
జిల్లాలో వినియోగంతో పాటు ఎగుమతి చేసేందుకు సరిపడా చేపల అభివృద్ధి జరుగుతుందని, ప్రణాళిక ప్రకారం సకాలంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం,జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు ఎం రామకృష్ణ, అధ్యక్షులు ఎల్ల బోయిన ప్రశాంత్, డైరెక్టర్ జి దేవేందర్, జి అంజయ్య, మెదక్ పిఎసిఎస్ చైర్మన్ చిలుముల హనుమంత్ రెడ్డి శ్రీనివాస్ చౌదరి రమేష్ మార్గం నాగరాజు ఆకుల మహేష్ సంబంధిత ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.