డివిజన్ల అభివృద్ధికి నిధులు కేటాయించండి.. సీఎంసీ కమిషనర్ సృజన ను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు జూన్ 03,  (మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి  అమీన్పూర్ సర్కిల్, పటాన్చెరు సర్కిల్ పరిధిలోని తొమ్మిది డివిజన్ల సమగ్ర అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయడంతో పాటు.. తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీలు జిహెచ్ఎంసిలో విలీనమయ్యే సమయంలో గల 250 కోట్ల రూపాయల మిగులు నిధులను సైతం డివిజన్ల అభివృద్ధికి మంజూరు చేయాలని సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజనను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.  మంగళవారం గచ్చిబౌలిలోని సిఎంసి ప్రధాన కార్యాలయంలో కమిషనర్ సృజనతో ఎమ్మెల్యే జిఎంఆర్...